చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం, పంటలనే కాదు రైతులను తొక్కి చంపుతున్నాయి

Webdunia
బుధవారం, 26 మే 2021 (21:21 IST)
చిత్తూరు జిల్లాలో గజరాజులు భీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి, పగలు అని తేడా లేకుండా ఇష్టానుసారం రోడ్లపైన, జనావాసాల మధ్య, పొలాల్లో, గ్రామాల మధ్య ఇలా ఎక్కడపడితే అక్కడ తిరిగేస్తున్నాయి. ఏనుగులను భయపెట్టి అటవీ ప్రాంతంలోకి తరుముదామని చూస్తున్న వారిపై దాడి చేస్తున్నాయి.
 
చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో ఏనుగల భీభత్సం అంతా ఇంతా కాదు. వేల ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి. పదుల సంఖ్యలో రైతులు, గ్రామస్తులను గాయపరిచాయి. అటవీ శాఖాధికారులకు ఎన్నిసార్లు గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నా ఉపయోగం లేకుండా పోతోంది.
 
తాజాగా గంగాదర నెల్లూరు మండలం వేల్కూరు ఇందిరానగర్ గ్రామ సమీపంలో ఏనుగుల సంచారం కనిపించింది. పంట పొలాల్లో పనిచేస్తున్న వజ్రవేలు అనే వ్యక్తి ఏనుగుల గుంపును తరిమేందుకు ప్రయత్నించడంతో అతనిపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో అతన్ని హుటాహుటిన తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వజ్రవేలు మృతి చెందారు. గత వారం రోజుల్లోనే ముగ్గురు ఏనుగుల దాడిలో మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments