Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

సెల్వి
గురువారం, 27 జూన్ 2024 (19:06 IST)
CH Kiran
దివంగత ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసింది. కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో రామోజీరావు సంస్మరణ సభ జరుగుతోంది. 
 
 
ఇంకా సీహెచ్ కిరణ్ మాట్లాడుతూ.. కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అపురూపంగా నిర్మితం కావాలని నాన్నగారైన రామోజీ రావు బలంగా ఆకాంక్షించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి శంకుస్థాపనకు హాజరై.. తన ఆనందాన్ని పంచుకున్నారని చెప్పారు.  
 
రామోజీరావుగారి ఆకాంక్ష మేరకు అమరావతి నగరం అపురూపంగా ఏర్పాటై, యావత్తు దేశానికే కీర్తి ప్రతిష్ఠలు తేవాలనే సంకల్పంతో తమ కుటుంబం తరపున పదికోట్ల రూపాయలను విరాళంగా అందజేస్తున్నామని ప్రకటించారు. 
 
తన తండ్రి రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడేవారని, ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారని పేర్కొన్నారు. నాన్నగారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంటానని మాటిస్తున్నాం అని కిరణ్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments