అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

సెల్వి
గురువారం, 27 జూన్ 2024 (19:06 IST)
CH Kiran
దివంగత ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసింది. కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో రామోజీరావు సంస్మరణ సభ జరుగుతోంది. 
 
 
ఇంకా సీహెచ్ కిరణ్ మాట్లాడుతూ.. కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అపురూపంగా నిర్మితం కావాలని నాన్నగారైన రామోజీ రావు బలంగా ఆకాంక్షించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి శంకుస్థాపనకు హాజరై.. తన ఆనందాన్ని పంచుకున్నారని చెప్పారు.  
 
రామోజీరావుగారి ఆకాంక్ష మేరకు అమరావతి నగరం అపురూపంగా ఏర్పాటై, యావత్తు దేశానికే కీర్తి ప్రతిష్ఠలు తేవాలనే సంకల్పంతో తమ కుటుంబం తరపున పదికోట్ల రూపాయలను విరాళంగా అందజేస్తున్నామని ప్రకటించారు. 
 
తన తండ్రి రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడేవారని, ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారని పేర్కొన్నారు. నాన్నగారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంటానని మాటిస్తున్నాం అని కిరణ్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments