Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

ఠాగూర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (18:36 IST)
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (#Jagan) అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (#ED) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.793 కోట్ల విలువ చేసే దాల్మియా సిమెంట్ (#DalimaCement) ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయం మార్చి 31వ తేదీన తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి లీజుల దాల్మియాకు అక్రమంగా కట్టబెట్టారని అభియోగం ఉంది. దాల్మియా నుంచి జగన్ సుమారు రూ.150 కోట్ల ముడుపులు తీసుకున్నారని సీబీఐ (#CBI) చార్జిషీటు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ అటాచ్‌‍మెంట్ ఉత్తర్వులు ఈ నెల 15వ తేదీన రాత్రి దాల్మియా సిమెంట్స్‌కు అందాయి. కొనుగోలు చేసినపుడు ఆ భూమి విలువ రూ.377 కోట్లు కాగా, ఇపుడు రూ.793 కోట్లుగా పేర్కొంది. కడప జిల్లా మైలవరం మండలంలోని తలమంచిపట్నం, నవాబ్ పేటలో 407 హెక్టార్లలో సున్నపురాయి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ, ఈడీ అభియోగాలు మోపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments