Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనకు శుభవార్త... గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ....

ఠాగూర్
బుధవారం, 22 జనవరి 2025 (08:28 IST)
సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి భారత ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. దేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా జనసేనను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్‌కు ఈసీ లేఖ రాసింది. అలాగే, జనసేనకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును రిజర్వు చేస్తున్నట్టు తెలిపింది. తాజా ప్రకటనతో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన అవతరించింది. ఇకపై గాజు గ్లాసు గుర్తును కేవలం జనసేన పార్టీకి మాత్రమే కేటాయిస్తారు. స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈ ఎన్నికల గుర్తును కేటాయించడానికి వీల్లేదు. 
 
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లలో పోటీ చేసి 100 శాతం స్ట్రైక్ రేటుతో అన్ని స్థానాలను గెలుచుకుంది. దీంతో స్వతంత్ర భారతావనిలో వంద శాతం విజయాన్ని సొంతం చేసుకున్న ఏకైక పార్టీగా జనసేన అవతరించి దేశం యావత్ తమవైపు చూసేలా చేసింది. దీంతో భారత ఎన్నికల సంఘం కూడా జనసేన పార్టీకి గుర్తింపు ఇవ్వడంతో పాటు గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా ఆ పార్టీకి కేటాయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments