Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనకు శుభవార్త... గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ....

ఠాగూర్
బుధవారం, 22 జనవరి 2025 (08:28 IST)
సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి భారత ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. దేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా జనసేనను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్‌కు ఈసీ లేఖ రాసింది. అలాగే, జనసేనకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును రిజర్వు చేస్తున్నట్టు తెలిపింది. తాజా ప్రకటనతో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన అవతరించింది. ఇకపై గాజు గ్లాసు గుర్తును కేవలం జనసేన పార్టీకి మాత్రమే కేటాయిస్తారు. స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈ ఎన్నికల గుర్తును కేటాయించడానికి వీల్లేదు. 
 
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లలో పోటీ చేసి 100 శాతం స్ట్రైక్ రేటుతో అన్ని స్థానాలను గెలుచుకుంది. దీంతో స్వతంత్ర భారతావనిలో వంద శాతం విజయాన్ని సొంతం చేసుకున్న ఏకైక పార్టీగా జనసేన అవతరించి దేశం యావత్ తమవైపు చూసేలా చేసింది. దీంతో భారత ఎన్నికల సంఘం కూడా జనసేన పార్టీకి గుర్తింపు ఇవ్వడంతో పాటు గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా ఆ పార్టీకి కేటాయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments