Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నంలో సైనేడ్ పెట్టి భర్త హత్యకు భార్య ప్లాన్...

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో ఓ దారుణం వెలుగుచూసింది. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు భార్య ప్లాన్ వేసింది. అన్నంలో సైనేడ్ పెట్టి హతమార్చేందుకు కుట్ర పన్నింది. ఈ కుట్రలో కుమారుడు కూడా భాగస్వామి కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని పోలసానిపల్లెలో గురునాథం - రాణి అనే దంపతులు ఉన్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో భర్తతో భార్యకు గొడవలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా కుమారుడు సహాయంతో భర్తను హత్య చేసేందుకు భార్య రాణి ప్లాన్ చేసింది. 
 
తమ ప్లాన్‌లో భాగంగా, భర్త తినే అన్నంలో సైనేడ్ కలిపి పెట్టింది. భోజనానికి కూర్చున్న గురునాథానికి అనుమానం వచ్చి అన్నం తినకుండా ప్రాణాలు రక్షించుకుని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు భార్యను, కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments