Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నంలో సైనేడ్ పెట్టి భర్త హత్యకు భార్య ప్లాన్...

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో ఓ దారుణం వెలుగుచూసింది. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు భార్య ప్లాన్ వేసింది. అన్నంలో సైనేడ్ పెట్టి హతమార్చేందుకు కుట్ర పన్నింది. ఈ కుట్రలో కుమారుడు కూడా భాగస్వామి కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని పోలసానిపల్లెలో గురునాథం - రాణి అనే దంపతులు ఉన్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో భర్తతో భార్యకు గొడవలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా కుమారుడు సహాయంతో భర్తను హత్య చేసేందుకు భార్య రాణి ప్లాన్ చేసింది. 
 
తమ ప్లాన్‌లో భాగంగా, భర్త తినే అన్నంలో సైనేడ్ కలిపి పెట్టింది. భోజనానికి కూర్చున్న గురునాథానికి అనుమానం వచ్చి అన్నం తినకుండా ప్రాణాలు రక్షించుకుని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు భార్యను, కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments