Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లాలో డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం...

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (08:13 IST)
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థినిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరంతా ఆ యువతి స్నేహితుడి ఫ్రెండ్స్ కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇటీవల ఫేర్‌వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత డిగ్రీ విద్యార్థిని ఒకరు స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్లింది. 
 
ఇద్దరూ కలిసి సంగంపుంత కాలనీ వద్ద ఉన్న ఇటుక బట్టీ సమీపానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా నలుగురు యువకులు అక్కడికి చేరుకుని, యువతి స్నేహితుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ విషయంపై బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై వల్లూరి రామకృష్ణ(కిట్టయ్య), సుంకర సత్యనారాయణ(వెంకన్న), చామంతి మధు, ములకల వీరబాబులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

తర్వాతి కథనం
Show comments