కోర్కె తీర్చకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తా... పరారీలో పితాని

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (17:14 IST)
చిన్నారులకు మంచి విద్యాబుద్ధులు చెప్పించాల్సిన ఓ అధ్యాపకుడు కామాంధుడి అవతారమెత్తాడు. తన కామవాంఛ తీర్చకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయం చివరకు పోలీసుల దృష్టికి వెళ్లడంతో లెక్చరర్ కనిపించకుండా పారిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
తూగో జిల్లాలోని సామర్లకోటలో ఉన్న వైఎల్ఆర్ కాలేజీలో ఓ యువతి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదే కాలేజీలో పితాని నూకరాజు అనే వ్యక్తి లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఈయన ఆ విద్యార్థినిపై కన్నేసి.. తన కామవాంఛ తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టారు. 
 
అక్కడితో ఆగకుండా అమ్మాయి ఫోన్‌ నంబరుకు అశ్లీల ఫొటోలు, సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. తన మాట వినకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ వేధింపులను తట్టుకోలేక బాలిక తల్లిదండ్రుల దృష్టికీ తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో యువతి ఫిర్యాదుతో సదరు కీచక లెక్చరర్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. అయితే ఈ విషయం ఎలాగో ముందుగానే తెలుసుకున్న పితాని నూకరాజు పరారయ్యాడు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments