Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్.. నలుగురు మృతి

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (09:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. మృతులను కృష్ణ, నాగేంద్ర, మణికంఠ, వీర్రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ప్లెక్సీలు కడుతుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 
 
ప్లెక్సీలు కడుపుతున్న సమయంలోపైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి గ్రామానికి చెందిన నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన కృష్ణ, నాగేంద్ర, మణికంఠ, వీర్రాజు అనే వారిగా గుర్తించారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక స్థానికుల సమాచారం ఘటనా స్థలానికి చేరుకుని ఉండ్రాజవరం పోలీసులు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments