Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూ.గో వైపు దూసుకొస్తున్న పెథాయ్ తుఫాను... ఏపీలో హైఅలెర్ట్

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (10:33 IST)
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా వైపు దూసుకొస్తోంది. ఇది చెన్నైకు 530 కిలోమీటర్లు, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలోవుంది. ఇది ఆదివారం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను ఈనెల 17వ తేదీన మచిలీపట్నం - కాకినాడల మధ్య తీరందాటొచ్చని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
కాగా, ఈ పెథాయ్ తుఫాను తీరందాటే సమయంలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని తెలిపింది. ఈ తుఫాను ప్రభావం కారణంగా ఉత్తర తమిళనాడుతో పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. 
 
ఇదిలావుండగా, తుఫాను ప్రభావిత జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రటించింది. అలాగే, 50కిపైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. 50 వేల నుంచి 75 వేల వరకు విద్యుత్ స్తంభాలను సిద్ధం చేసివుంచింది. అనేక గ్రామాల్లో జనరేటర్లను సిద్ధంగా ఉంచి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ముందస్తు చర్యలు చేపట్టింది. 
 
ఇదిలావుండగా, తూర్పుగోదావరితో పాటు కోస్తాతీర జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిత్యావసర వస్తువులను భారీ సంఖ్యలో నిల్వవుంచింది. 2200 పేరుతో ఓ ప్రత్యేక నంబరుతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. 
 
ఇదిలావుంటే, పెథాయ్ తుఫాను వల్ల తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో ఏపీ సీఎంకు గవర్నర్ నరసింహన్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం