Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భూకంపం.. 3 నిమిషాల వ్యవధిలో...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (08:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భూమి కంపించింది. కేవలం 3 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూప్రకంపనలు కనిపించాయి. దీంతో స్థానికులు భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనం భయంతో ఇళ్లకు బీటలు వారాయి. ఇళ్లలోని సామాగ్రి అంతా చెల్లాచెదురుగా పడిపోయింది. వంటిట్లోని అనేక సామానులు కిందపడిపోయాయి. 
 
ముందు వచ్చిన ప్రకంపనలు ఆగిపోయాయని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో చివరిగా రాత్రి ఒంటి గంట తర్వాత మరోమారు భూమి కంపించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేశారు. 
 
ఈ భూప్రకంపనలు ఇచ్ఛాపురం మండలంలోని రత్తకన్న, వీకేపేట, దాసన్నపేట, దానంపేట తదితర ప్రాంతాల్లో కంపించిందని స్థానిక తాహశీల్దారు శ్రీహరిబాబు వెల్లడించారు. కవిటి మండలంలో దాదాపు పది గ్రామాల్లో భూప్రకంపనలు కనిపించాయని ఆయా గ్రామాల ప్రజలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments