Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంచీపురం వకుళ సిల్క్స్.. దివ్వెల మాధురి కొత్త వ్యాపారం (video)

సెల్వి
శుక్రవారం, 31 జనవరి 2025 (17:16 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని సన్నిహితురాలు దివ్వెల మాధురి తరచుగా మీడియా దృష్టిలో ఉంటారు. వారి వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఇప్పుడు వీరిద్దరూ భారీ స్థాయిలో వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారని, ఈ వెంచర్‌లో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నారని సమాచారం.
 
హైదరాబాద్‌లోని చందానగర్‌లో తమ మొదటి షోరూమ్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 21న ప్రారంభోత్సవం జరగనుందని టాక్. సాంప్రదాయ పట్టు వస్త్రాలపై దృష్టి సారిస్తూ షోరూమ్‌కి "కాంచీపురం వకుళ సిల్క్స్" అని పేరు పెట్టారు.
 
చందానగర్లో కొత్త దుకాణాన్ని ప్రారంభించిన వెంటనే హైదరాబాద్‌లో మరో వస్త్ర దుకాణంతో పాటు, ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం వంటి మెట్రోపాలిటన్ నగరాల్లోనూ తమ మాల్స్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నారు.
 
పట్టు చీరల కలెక్షన్స్ కోసం ఇప్పటికే కోల్‌కతా, బెనారస్, ధర్మవరం, కంచి, బెంగుళూరు, హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాలు తిరుగుతూ తమకు నచ్చిన పట్టు చీరలను వ్యాపారం కోసం కొనుగోలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments