Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ తప్పతాగి భార్యాపిల్లల్ని వేధించాడు.. చుక్కేసి దురుసుగా ప్రవర్తించాడు.. అంతే చంపేశారు!

రోజూ తప్ప తాగి భార్యాపిల్లల్ని వేధించాడు. చుక్కేసి ఇష్టానికి మాట్లాడేవాడు.. భార్యాపిల్లలపై చేజేసుకునేవాడు. సంవత్సరాల పాటు తాగుబోతు భర్తను, తండ్రిని వారు భరించారు. కానీ వారి సహనం కోల్పోయింది. దీంతో తాగ

Webdunia
గురువారం, 28 జులై 2016 (09:08 IST)
రోజూ తప్ప తాగి భార్యాపిల్లల్ని వేధించాడు. చుక్కేసి ఇష్టానికి మాట్లాడేవాడు.. భార్యాపిల్లలపై చేజేసుకునేవాడు. సంవత్సరాల పాటు తాగుబోతు భర్తను, తండ్రిని వారు భరించారు. కానీ వారి సహనం కోల్పోయింది. దీంతో తాగుబోతును చంపేశారు. ఈ ఘటన ముప్పాళ్లలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ముప్పాళ్ల మండలంలోని ఇరుకు పాలెం గ్రామానికి చెందిన మరియ దాసును భార్యా, అతని పిల్లలే హత్య చేశారని సత్తెనపల్లి రూరల్‌ సీఐ కోటేశ్వరరావు పోలీసులు తెలిపారు. 
 
జూలై ఐదో తేదీన మరియదాసును తన నివాసంలోనే భార్య ఝాన్సీరాణి, కుమారులు ధనరాజు, విజయ్‌లు పచ్చడి బండతో తలపై కొట్టి హత్య చేశారని, అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా సత్తెన పల్లి రైలు పట్టాలపై పడేశారని పోలీసులు వెల్లడించారు. అనుమానం మేరకు కుటుంబ సభ్యులపై విచారణ జరపడంతో హతుడు మరియ దాసు అతిగా మద్యం తాగి తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ప్రతి రోజూ వేధింపులకు గురిచేసేవాడని, ఆ వేధింపులకు తట్టుకోలేక హత్యచేసినట్లు భార్య ఝాన్సీరాణి అంగీకరించిందని సీఐ తెలిపారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments