భోగీలను వదిలేసి ఇంజన్ తో వెళ్లిపోయిన డ్రైవర్

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (08:18 IST)
తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెనుప్రమాదం తప్పింది. విశాఖ వెళ్లాల్సిన ట్రైన్లు తుని రైల్వే స్టేషన్ వద్ద క్రాసింగ్ కావాల్సిఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎక్స్ ప్రెస్ డ్రైవర్ భోగీలను వదిలేసి ముందుకు వెళ్లిపోయాడు. సుమారు పది కిలోమీటర్ల మేర డ్రైవర్ ఇంజన్ తో వెళ్లిపోయాడు. 
 
భోగీలను వదిలేసి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. భయంతో కేకలు వేశారు. మధ్యలో నిలిచిపోవడంతో ఎటువైపు నుంచి ట్రైన్ వస్తుందోనని తెలియక టెన్షన్ పడ్డారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. 
 
దాంతో భోగీలు వదిలి వెళ్లిపోయిన డ్రైవర్ వెనక్కి వచ్చాడు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇంజన్ రాకపోవడంతో తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందారు ప్రయాణికులు. డ్రైవర్ వచ్చి భోగీలకు ఇంజిన్ అమర్చి యదావిధిగా తీసుకెళ్లాడు.

అయితే ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా హమ్మయా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

తర్వాతి కథనం
Show comments