Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 160 కోట్లతో డ్రీమ్ ప్రాజెక్ట్.. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం

సెల్వి
శనివారం, 19 అక్టోబరు 2024 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శనివారం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించారు. రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో గత ఐదేళ్ల విరామం తర్వాత 'డ్రీమ్ ప్రాజెక్ట్'ను ప్రారంభించారు. 
 
2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూటమి సర్కారు కొలువు దీరడంతో అమరావతి రాజధాని ప్రాజెక్టుకు పెద్దపీట వేసింది. అక్టోబర్ 16న జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో పనులు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు శనివారం అధికారిక ప్రకటనలో తెలిపారు. అమరావతిని సంపద సృష్టికి కేంద్రంగా మార్చే వారికే భూముల కేటాయింపులు జరపాలని నిర్ణయించారు. 
 
టాప్ 10 కాలేజీలు, స్కూల్స్, ఆసుపత్రులు ఏర్పాటయ్యేలా ప్రణాళికలు రచించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 160 కోట్లతో ఏడు అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టింది. ఆ పనులను గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం