Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నాయకుల చేతగానితనానికి అదే నిదర్శనం: సురేష్

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (16:32 IST)
Adimulapu Suresh
రాజధాని అంశాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడటం టీడీపీ నాయకుల చేతకానితనానికి నిదర్శనమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎంపీ నందిగం సురేష్ పై జరిగిన దాడిని మంత్రి సురేష్ ఒక ప్రకటనలో ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై దాడి జరిగిందని, టీడీపీ అకృత్యాలకు ఇది నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మొన్న విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై, నిన్న చిలకులూరిపేట ఎమ్మెల్యే వాహనంపై, ఇప్పుడు ఎంపీ సురేష్ పై దాడి చేయటం హేమమైన చర్య అన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు టీడీపీ నాయకులకు మతి భ్రమించి ఏమి చేయలేని స్థితిలో రైతులను అడ్డుపెట్టుకొని టీడీపీ గుండాలను రంగంలోకి దింపి దాడులకు పాల్పడుతోందన్నారు. 
 
గతంలో రాజధాని భూములు కొల్లగొట్టేందుకు టీడీపీ చేసిన దుశ్చర్యలకు అప్పట్లో సురేష్ ఎదురు నిలిచిన సంగతి అందరికీ తెలుసునని, దానిని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఉద్దేశపూర్వకంగా ఎంపీపై కొందరు కిరాయి మనుషులతో ఇప్పిటికి రెండుసార్లు దాడికి పాల్పడటం జరిగిందన్నారు. 
 
దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు ఇటువంటి చర్యలతో ప్రజాప్రతినిధులను భయపెట్టాలని చూస్తే బెదిరేవాళ్ళు లేరని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments