Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజావేదిక పరికరాల వేలం... సీఆర్డీఏ నిర్ణయం

Advertiesment
CRDI
, సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (15:43 IST)
తొమ్మిది నెలల క్రితం కూల్చేసిన ప్రజావేదిక పరికరాలను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదికను తొమ్మిది నెలల క్రితం అధికారులు కూల్చివేశారు. ప్రజా వేదికను అనుమతుల్లేవంటూ దాన్ని వెంటనే తొలగించాలని సీఎం జగన్ ఆదేశించిన మరుసటి రోజే సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. 
 
అప్పటి నుంచి తొమ్మిది నెలల పాటు ఏసీలు, పరికరాలను అలానే ఉంచేశారు. చివరకు ఆ పరికరాలను వేలం వేయాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. మార్చి 3వ తేదీలోగా వేలం పత్రాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ వేలం ప్రారంభం కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ఉన్మాదులతో, రాక్షస మూకలతో యుద్ధం చేస్తున్నాను: సీఎం జగన్