భార్యపై అనుమానం... లక్ష రూపాయలకు అమ్మేశాడు.. ఆ తరువాత?

కట్టుకున్న భర్తే తాగుడుకు బానిసై భార్యను అమ్మేశాడు. అది కూడా వ్యభిచార గృహానికి.. రెండు నెలల పాటు చిత్ర హింసలు అనుభవించిన ఆ మహిళ చివరకు ఎలాగోలా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (18:19 IST)
కట్టుకున్న భర్తే తాగుడుకు బానిసై భార్యను అమ్మేశాడు. అది కూడా వ్యభిచార గృహానికి.. రెండు నెలల పాటు చిత్ర హింసలు అనుభవించిన ఆ మహిళ చివరకు ఎలాగోలా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
ఎమ్మిగనూరు పట్టణంలోని గాంధీ వీధికి చెందిన రాజేష్‌ అనే వ్యక్తికి సంవత్సరం క్రితం అదే ప్రాంతానికి చెందిన సుజాతతో వివాహమైంది. ఆరు నెలల వరకు వీరి సంసారం బాగానే సాగింది. ఇంట్లో తన తండ్రి పెన్షన్ డబ్బుపై ఆధారపడి జీవించే వారు రాజేష్ కుటుంబం. ఉద్యోగం లేకపోవడంతో బాధతో తాగుడుకు బానిసైన రాజేష్‌ రోజూ తాగొచ్చి చిత్ర హింసలు పెట్టేవాడు. భర్త తాగుడు కోసం సుజాత ఇళ్ళల్లో పాచి పని చేస్తూ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది. 
 
అయితే భార్యపై అనుమానం పెట్టుకున్న భర్త రెండు నెలల క్రితం పూటుగా మద్యం తాగొచ్చి బయటకు వెళదామని సుజాతను స్కూటర్ పైన ఎక్కించుకుని వ్యభిచార గృహానికి తీసుకెళ్లి లక్ష రూపాయలకు అమ్మేశాడు. దీంతో సుజాత రెండు నెలల పాటు వ్యభిచార గృహంలో నరక యాతన అనుభవించి నిన్న మధ్యాహ్నం తప్పించుకుని బయటకు వచ్చి ఎమ్మిగనూరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి పలువురు మహిళలను విడిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments