కర్నూలు వెలుగోడులో కలకలం రేపిన జంట హత్యలు

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:47 IST)
కర్నూలు జిల్లా వెలుగోడు సీపీనగర్‌లో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. చిన్ని అనే మహిళ, ఓబులేసు అనే వ్యక్తిని నరికి చంపారు. అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్దాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇద్దరు భార్యలు. వెలుగోడులో నివాసం ఉంటున్నారు. మల్లికార్జున దగ్గర ఓబులేసు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఓబులేసు కూడా మల్లికార్జునతో అతని ఇంట్లోనే ఉండేవాడు. 
 
అయితే, ఈ క్రమంలోనే అర్థరాత్రి ఓబులేసు, మల్లికార్జున రెండో భార్య చిన్నిలను కిరాతకంగా హత్య చేశారు. మల్లికార్జున తండ్రి ఈ హత్యలకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లికార్జున తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 
 
రెండు మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తుచేపట్టారు. మల్లికార్జున రెండో భార్య చిన్నతో ఓబులేసుకు అక్రమ సంబంధం ఉండివుంటుందని అందువల్లే వారద్దరిని చంపివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bramhi: కామెడీ, మిస్టరీ అంశాల‌తో మేము‘కాప్’లం ట్రైల‌ర్‌ కు బ్రహ్మానందం కితాబు

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చింది - కిరణ్ అబ్బవరం

Durgesh: ఆంధ్ర సినీ రాజధానిగా తిరుపతి - కందుల దుర్గేష్‌ ని కలిసిన పారడాక్స్ పిక్చర్స్ అధినేతలు

ఐదు సూత్రాల చుట్టూ తిరిగే జీవితనేపథ్యంగా ఏదైనా సాధ్యమే మూవీ

'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments