కర్నూలు వెలుగోడులో కలకలం రేపిన జంట హత్యలు

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:47 IST)
కర్నూలు జిల్లా వెలుగోడు సీపీనగర్‌లో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. చిన్ని అనే మహిళ, ఓబులేసు అనే వ్యక్తిని నరికి చంపారు. అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్దాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇద్దరు భార్యలు. వెలుగోడులో నివాసం ఉంటున్నారు. మల్లికార్జున దగ్గర ఓబులేసు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఓబులేసు కూడా మల్లికార్జునతో అతని ఇంట్లోనే ఉండేవాడు. 
 
అయితే, ఈ క్రమంలోనే అర్థరాత్రి ఓబులేసు, మల్లికార్జున రెండో భార్య చిన్నిలను కిరాతకంగా హత్య చేశారు. మల్లికార్జున తండ్రి ఈ హత్యలకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లికార్జున తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 
 
రెండు మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తుచేపట్టారు. మల్లికార్జున రెండో భార్య చిన్నతో ఓబులేసుకు అక్రమ సంబంధం ఉండివుంటుందని అందువల్లే వారద్దరిని చంపివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shobhita Dhulipala: చీకటిలో ... చీకటి రహస్యాలను వెలికితీసే శోభిత ధూళిపాల

Naveen Polishetty: పండగకు .వినోదాన్ని పంచే అల్లుడు వస్తున్నాడు : నవీన్ పోలిశెట్టి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్- ఆన్‌లైన్‌లో కరాటే టు సామురాయ్ కొత్త వీడియో

విజయ్ 'జన నాయగన్' మూవీ రిలీజ్ వాయిదా

Maruthi: రాజా సాబ్ కు మొదటి రోజు వంద కోట్లకు పైగా వస్తాయని ఆశిస్తున్నాం - టీజీ విశ్వప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌

నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర

తర్వాతి కథనం
Show comments