Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న ఇళ్ల పథకంపై హైకోర్టు స్టే.. తీర్పు హర్షణీయమన్న రామకృష్ణ

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (16:12 IST)
జగన్ సర్కారుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ఊహించని షాకిచ్చింది. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో తాత్కాలికంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. 
 
పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయింపును తీవ్రంగా తప్పుబట్టింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించిన 128 మంది పిటిషనర్ల వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు .. 108 పేజీల తుది తీర్పును వెలువరించింది.
 
పేదలకు స్థలాలు, జగనన్న ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పుపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షణీయమని పేర్కొన్నారు. సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు తెలిపారు. 
 
పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున కేటాయించాలని ముందే చెప్పామని రామకృష్ణ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేలు ఏ మాత్రం సరిపోవని... అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే నివాసయోగ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments