Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కలు మొరిగాయని వాటి యజమాని పళ్లూడగొట్టాడు

Webdunia
బుధవారం, 20 మే 2020 (17:34 IST)
కుక్కలు మొరిగాయని యజమాని పళ్లూడగొట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రగాయాలైన అతడిని తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్చారు. వివరాల్లోకి వెళితే చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి మేకలు కాస్తుంటాడు. సాయంత్రం మేకలను మేపు నుండి తోలుకువచ్చి, ఇంటి బయట సేదతీరుతున్నాడు. 
 
ఇంతలో కొంతమంది వ్యక్తులు ఆ దారిలో వెళ్తుంటే అతని కాపలా కుక్కలు వారిని చూసి మొరిగాయి. వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోయినా, ఇంటి ఎదురుగా నివసించే మల్లికార్జునాచారి, ఆయన భార్య సరిత, కొడుకు శ్రావణ్ కుక్కల అరుపులకు విసిగిపోయి రాళ్ల దాడికి దిగారు. కుక్కలపై రాళ్లు విసిరినందుకు కృష్ణయ్య కోప్పడటంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
గొడవ పెద్దదయి మల్లికార్జునాచారి, అతని కుటుంబ సభ్యులు కృష్ణయ్య మీద రాళ్లు విసరడం ప్రారంభించారు. అవి ముఖానికి తగిలి గాయాలయ్యాయి. కొన్ని పళ్లు కూడా రాలిపోయాయి. తీవ్రంగా గాయపడిన కృష్ణయ్యను అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకున్న తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మల్లికార్జునాచారి, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments