Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కలు మొరిగాయని వాటి యజమాని పళ్లూడగొట్టాడు

Webdunia
బుధవారం, 20 మే 2020 (17:34 IST)
కుక్కలు మొరిగాయని యజమాని పళ్లూడగొట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రగాయాలైన అతడిని తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్చారు. వివరాల్లోకి వెళితే చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి మేకలు కాస్తుంటాడు. సాయంత్రం మేకలను మేపు నుండి తోలుకువచ్చి, ఇంటి బయట సేదతీరుతున్నాడు. 
 
ఇంతలో కొంతమంది వ్యక్తులు ఆ దారిలో వెళ్తుంటే అతని కాపలా కుక్కలు వారిని చూసి మొరిగాయి. వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోయినా, ఇంటి ఎదురుగా నివసించే మల్లికార్జునాచారి, ఆయన భార్య సరిత, కొడుకు శ్రావణ్ కుక్కల అరుపులకు విసిగిపోయి రాళ్ల దాడికి దిగారు. కుక్కలపై రాళ్లు విసిరినందుకు కృష్ణయ్య కోప్పడటంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
గొడవ పెద్దదయి మల్లికార్జునాచారి, అతని కుటుంబ సభ్యులు కృష్ణయ్య మీద రాళ్లు విసరడం ప్రారంభించారు. అవి ముఖానికి తగిలి గాయాలయ్యాయి. కొన్ని పళ్లు కూడా రాలిపోయాయి. తీవ్రంగా గాయపడిన కృష్ణయ్యను అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకున్న తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మల్లికార్జునాచారి, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments