Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ సంప్రదాయాలను హేళన చేస్తారా? శ్రీనివాసానంద స్వామి ఆవేదన

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (16:38 IST)
హిందూ సంప్రదాయాలను హేళన చేసే దోరణి మారాలని  శ్రీనివాసానంద స్వామి అన్నారు. విశాఖ‌ప‌ట్నం ప్రెస్ క్ల‌బ్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సింహాచలంలో గరుడ నారసింహ వార్షికోత్సవంలో ఆడియోలను మార్ఫింగ్ చేస్తే, ప్ర‌భుత్వం నుంచి స్పందన ఏదని శ్రీనివాసానంద స్వామి ప్రశ్నించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసయ్య స్త్రోత్రాలు గతంలో తాము చూశామని, అపుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

ఇప్పుడు మళ్లీ అదే విధంగా త‌మ మనోభావాలను దెబ్బతీయాలని చూశారని శ్రీనివాసానంద స్వామి ఆరోపించారు. సింహాచ‌లం దేవ‌స్థానం పాలకమండలి స్పందించడం లేదన్నారు. ఈఓ సూర్యకళ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని  శ్రీనివాసానంద స్వామి డిమాండ్ చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నా దేవాదాయశాఖ మంత్రి మాట్లాడరెందుకని స్వామి ప్రశ్నించారు. రామతీర్ధం ఘటన పై 24 గంటల్లో దోషుల్ని పట్టుకుంటామన్నారని, కానీ ఏమైందని  శ్రీనివాసానంద స్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. దేవాలయాలకు పట్టిన దుస్ధితిపై ఎంపీ  విజయసాయిరెడ్డి ఎందుకు స్పందించరని శ్రీనివాసానంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments