అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు: గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ

Webdunia
సోమవారం, 20 జులై 2020 (18:15 IST)
అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నందువలన ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రజలు కొన్ని ముఖ్య జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. 
 
స్వీయ సంరక్షణలో చర్యలలో భాగంగా ప్రజలందరూ నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనేటప్పుడు భౌతిక దూరం పాటించాలని, సానిటైజర్లను అందుబాటులో ఉంచుకొని అవసరమైనన్ని సార్లు చేతులు సానిటైజ్ చేసుకోవాలని, మాస్క్ లు తప్పని సరిగా వాడాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని తెలిపారు. 
 
ద్విచక్ర వాహనాలపై ఒకరి కంటే ఎక్కువమంది ప్రయాణించిన ఎడల క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ పోలీ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని,
 
మాస్కులు ధరించకుండా బయట తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందువలన బయట తిరిగే వారు ఎల్లప్పుడూ మాస్క్ లు ధరించి పోలీస్ వారికి సహకరించి కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టుటకు పోలీసు వారికి సహకరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments