Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న కొండా సురేఖ.. వైభవంగా దీపావళి ఆస్థానం (Video)

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (15:59 IST)
Konda surekha
తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వారికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శనానంతరం వేదాశీర్వచనం, ప్రసాదం అందించారు. 
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య గీత, కూతురు, అల్లుడు కూడా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. యాంకర్ ప్రదీప్, నటుడు ప్రేమ కూడా అదే రోజు దర్శనం చేసుకున్నారు. దీంతో దీపావళిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని ఎక్కువ సంఖ్యలో సెలబ్రిటీలు దర్శించుకున్నారు. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు హాజరైన వైభవంగా జరిగిన కార్యక్రమంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకలు నిర్వహించారు. 
 
ప్రముఖులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కిరణ్ స్వామి, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments