Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో దారుణం.. వరద బాధితులకు కాలం చెల్లిన నూనె ప్యాకెట్ల పంపిణీ

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (19:06 IST)
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరదలకు సర్వస్వం కోల్పోయి బాధపడుతున్న ప్రజలను మరింత క్షోభకు గురిచేసేలా అధికారులు వ్యవహరించారు. వరద బాధితులకు అందించిన ఆహార సామగ్రిలో కాలం చెల్లిన వంటనూనెను అందించారు.

ఈ నూనె ప్యాకెట్ల కాలపరిమితి గత నెలతో ముగిసినప్పటికీ అధికారులు ఆ ప్యాకెట్లను వరద బాధితులకు అంటగట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలంలో వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై స్థానికుడొకరు మాట్లాడుతూ..‘వరద వచ్చిన 5 రోజుల తర్వాత అధికారులు వచ్చి సామగ్రి అందించారు. అందులోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఇచ్చారు. ఇలాంటి చర్యలతో మా ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు.

కాగా, ఈ వ్యవహారంపై అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. అయితే స్థానిక అధికారులు మాత్రం కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను వెనక్కి తీసుకెళ్లినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments