Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ నిందితుల ఎన్ కౌంటర్: హ్యాట్సాఫ్ కేసీఆర్ అంటూ ఏపీ సీఎం జగన్-video

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (18:50 IST)
దిశ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై వచ్చిన పోలీసు తీర్పు ఎన్‌కౌంటర్. ఇది కూడా దేశంలో పెద్ద ఎత్తున ప్రచారానికి తెరదీసింది. నలుగురు మృగాళ్ళకు పడిన సరైన శిక్ష అంటూ యావత్ దేశం మొత్తం కూడా సంబరాలు చేసుకుంది. 
 
దిశ హత్యపై తెలంగాణా సిఎం సరిగ్గా స్పందించలేదంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్సలు చేశాయి. అయితే మౌనంగా ఉన్న కెసిఆర్ అన్నింటిని విన్నారు. పోలీసుల తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సరైన సమయానికి పోలీసులు స్పందించి ఉంటే దిశ బతికి ఉండేదన్న వాదన వినిపించింది. 
 
ఒకవైపు ప్రభుత్వానికి, మరోవైపు పోలీసులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటంతో కెసిఆర్ ఎవరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఎపి అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం జగన్ మాట్లాడుతూ... నేను ఇద్దరు ఆడపిల్లల తండ్రినే. నాకు ఒకే ఒక భార్య ఉంది. నాకు చెల్లెలు ఉంది. ఇద్దరు కుమార్తెలు నాకు ఉన్నారు. అందుకే చెబుతున్నా కెసిఆర్ హ్యాట్సాప్.. తెలంగాణా పోలీస్ హ్యాట్సాఫ్ మంచి తీర్పు వచ్చిందంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments