Webdunia - Bharat's app for daily news and videos

Install App

#JusticeForGeethanjali తెనాలి గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకున్నదా? సోషల్ మీడియాలో భిన్న వాదనలు

ఐవీఆర్
మంగళవారం, 12 మార్చి 2024 (13:11 IST)
కర్టెసి-ట్విట్టర్
మార్చి 7వ తేదీనాడు తెనాలి రైల్వే లైన్ క్రాస్ చేస్తూ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనలో గీతాంజలి(#JusticeForGeethanjali) అనే 30 ఏళ్ల మహిళ తీవ్రగాయాలకు గురైంది. ఆ తర్వాత ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి రెండురోజుల చికిత్స చేసిన అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూసింది. ఆమె చనిపోవడానికి కారణం.. తెదేపా-జనసేన సోషల్ మీడియా ట్రోల్స్ కారణమంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం సాగింది. ఎందుకంటే... జగనన్న ఇల్లు తనకు వచ్చిందన్న సంతోషంతో ఆమె ఓ వీడియోలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కనబడింది.
 
అంతేకాదు... వచ్చే ఎన్నికల్లో జగనన్నకి ఓటు వేసి గెలిపిస్తామంటూ కూడా చెప్పింది. ఈ నేపధ్యంలో ఆమె 7వ తేదీన రైలు ప్రమాదానికి గురైంది. ఐతే ఇది ప్రమాదం కాదు... ఆత్మహత్య అంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం సాగిస్తోంది. మరోవర్గం ఇదంతా అవాస్తవమనీ, 7వ తేదీనాడు ప్రమాదం జరిగిన నాడే ఈ వార్తలు ఎందుకు రాయలేదని నిలదీస్తోంది.
 
కనీసం 8వ తేదీనాడైనా రాయాలి కదా అని ప్రశ్నిస్తోంది. ఆమె చనిపోయిన తర్వాత ఆ మహిళ మరణానికి ఫలానా పార్టీలు ట్రోల్స్ కారణమంటూ ఎలా నిర్థారిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరికి తోచినట్లు వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేస్తున్నారు. వాస్తవం ఏంటన్నది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments