Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందరాజస్వామి కిరీటాలు దొరికాయ్.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (19:39 IST)
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో మాయమైన కిరీటాల కేసును ఎట్టకేలకు ఛేదించారు అర్బన్ జిల్లా పోలీసులు. కిరీటాలను మాయం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలోని దాదర్ రైల్వేస్టేషన్‌లో నిందితుడు ఆకాష్ ప్రతాప్ సరోడేని 
చాకచక్యంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
నిందితుడు నాందేడ్ జిల్లా హనుమాన్ మందిర్ జావాల్ కాందార్ ప్రాంతంలో నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 2వ తేదీ గోవిందరాజ స్వామి ఆలయంలోని అనుబంధ ఆలయం కళ్యాణ వేంకటేశ్వరస్వామికి చెందిన మూడు కిరీటాలు కనిపించకుండా  పోయాయి. 
 
అర్బన్ జిల్లా పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి గత రెండు నెలల నుంచి నిందితుడి కోసం 
గాలిస్తున్నారు. మధ్యాహ్నం నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని ఒక కిరీటాన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కిరీటాన్ని నిందితుడు కుదవ పెట్టగా, మరో కిరీటాన్ని పగులగొట్టి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. పాత నేరస్తులందరినీ పోలీసులు విచారిస్తూ వెళుతుండగా అసలు నిందితుడు బయటపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments