Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందరాజస్వామి కిరీటాలు దొరికాయ్.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (19:39 IST)
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో మాయమైన కిరీటాల కేసును ఎట్టకేలకు ఛేదించారు అర్బన్ జిల్లా పోలీసులు. కిరీటాలను మాయం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలోని దాదర్ రైల్వేస్టేషన్‌లో నిందితుడు ఆకాష్ ప్రతాప్ సరోడేని 
చాకచక్యంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
నిందితుడు నాందేడ్ జిల్లా హనుమాన్ మందిర్ జావాల్ కాందార్ ప్రాంతంలో నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 2వ తేదీ గోవిందరాజ స్వామి ఆలయంలోని అనుబంధ ఆలయం కళ్యాణ వేంకటేశ్వరస్వామికి చెందిన మూడు కిరీటాలు కనిపించకుండా  పోయాయి. 
 
అర్బన్ జిల్లా పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి గత రెండు నెలల నుంచి నిందితుడి కోసం 
గాలిస్తున్నారు. మధ్యాహ్నం నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని ఒక కిరీటాన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కిరీటాన్ని నిందితుడు కుదవ పెట్టగా, మరో కిరీటాన్ని పగులగొట్టి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. పాత నేరస్తులందరినీ పోలీసులు విచారిస్తూ వెళుతుండగా అసలు నిందితుడు బయటపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments