Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ కుమారుడే కాదు... మేమూ విదేశాల్లో చదువుకున్నాం... చెవిరెడ్డికి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె కౌంటర్!

వరుణ్
సోమవారం, 29 జులై 2024 (14:55 IST)
విదేశాల్లో చదువుకున్న తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసి వీధి పోరాటలకు సిద్ధం చేస్తున్నారంటూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె ధూళిపాళ్ల వైదీప్తి ఘాటుగానే కౌంటరిచ్చారు. చెవిరెడ్డిగారూ.. మీ కుమారుడు మాత్రమే కాదు.. మేం కూడా విదేశాల్లో చదువుకుని వచ్చినవాళ్లమే. గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనపై మాలాంటి వారి తల్లిదండ్రులపై వైకాపా నేతలు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టించారో ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలంటూ గుర్తు చేశారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుబులోకి తీసుకుని 41ఏ కింద నోటీసులిచ్చి వదిలేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
"నా కుమారుడు వయసు 25 యేళ్లు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడు. కానీ అక్రమ కేసులో అరెస్టు చేయించారు. తద్వారా విదేశాల్లో చదివిన నా కొడుకును వీధి పోరాటలకు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు. నేను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగిన వాడ్ని. నన్ను మించి నా కొడుకు ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు చేస్తుంటే ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి పోలీసులకు రుచి చూపించండం ఖాయం . ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైన పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం అంటూ ట్వీట్ చేశారు. 
 
దీనిపై ధూళిపాళ్ళ వైదీప్తి కౌంటరిచ్చారు. "మూడేళ్ల కింద నాకు 23 యేళ్ల వయసున్నడు నేను అమెరికాలో చదువుకుంటున్నాను. ఆ సమయంలో మా నాన్న ధూళిపాళ్ల నరేంద్రను మీ పార్టీ ప్రతీకార రాజకీయాల వల్ల అన్యాయంగా అరెస్టు చేశారు. మన విలువను నిరూపించుకోవడానికి విదేశీ డిగ్రీలు చూపించుకోవాల్సి అవసరం లేదు. మనం ఎక్కడ చదువుకున్నాం అనేది కాదు.. మనం ఎటువంటి విలువలు పాటిస్తున్నాం అనేది ముఖ్యం. గత ప్రభుత్వ హయాంలో మాలాంటి వాళ్లు చాలా మంది ఎంత బాధను అనుభించామో మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను' అంటూ కౌంటరిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments