తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి కలకలం : తితిదే అలెర్ట్

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (11:46 IST)
తిరుమల తిరుపతిలో మరోమారు చిరుతపులి కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం సర్కిల్‌లోని ఓ కొండపై గురువారం సాయంత్రం చిరుత కూర్చుని ఉండటాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకుని తితిదే విజిలెన్స్‌, ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో వాహనదారులను, భక్తులను అధికారులు అప్రమత్తం చేశారు. 
 
కాగా, గతంలో పలుమార్లు చిరుతపులి తిరుమల కొండల్లో కనిపించి కలకలం రేపిన విషయం తెల్సిందే. వైకాపా ప్రభుత్వంలో ఓ చిరుత పులి ఓ బాలికపై దాడి చేసి చంపేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు రక్షణగా వైకాపా పాకలకులకు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో కూడిన చేతికర్రలను కూడా ఇచ్చింది. ఈ చర్య విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత కొంతకాలం చిరుతపులి హడావుడి కనిపించలేదు. ఇపుడు మళ్లీ కనిపించడంతో కలకలం చెలరేగింది. దీంతో కానినడకన తిరుమల వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా నడిచి వెళ్లరాదని, సమూహాలుగా వెళ్ళాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వానలో మిల్కీ బ్యూటీ తమన్నా వణికిపోతుంటే 11 లక్షల మంది చూసారు, వీడియో

హూర్‌తో కశ్మీర్ సంగీత వారసత్వాన్ని మనముందుకు తీసుకువస్తున్న కోక్ స్టూడియో భారత్ సీజన్ 4

Suman: మూఢనమ్మకాలను ఎండగట్టే కథతో నిమ్మకాయ.. నీకెందుకు భయం చిత్రం

Mupapa: ఆయుష్మాన్ ఖురానా చిత్రం ముపాపా రిలీజ్ డేట్ ఖరారు

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

తర్వాతి కథనం
Show comments