Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు కట్టుకుని దర్శన టిక్కెట్ల కోసం శ్రీవారి భక్తులు, ఎంత పెద్ద క్యూలైనో గోవిందా

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (18:25 IST)
ఎప్పుడు తిరుమల శ్రీవారి దర్సనం కోసం టోకెన్లను మంజూరు చేసినా భక్తులు మాత్రం వెనక్కి తగ్గరు. ఆ స్వామివారిని దర్సించుకోవడానికి భక్తులు ఎంతసేపయినా వేచి ఉంటారు. టోకెన్లను పొందుతారు. సరిగ్గా వారంరోజుల క్రితం నుంచి టోకెన్ల ప్రక్రియను టిటిడి నిలిపివేసింది.
 
ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి టోకెన్లను ఈ నెల 30వ తేదీ వరకు అందిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో టోకెన్లను పొందేందుకు భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. అర్థరాత్రి నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుపతిలో టోకెన్లను కేటాయించే మూడు ప్రాంతాల్లోను భక్తుల రద్దీ అదే స్థాయిలో కనిపించింది.
 
ముఖ్యంగా అలిపిరికి దగ్గరలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు బారులు తీరారు. రెండు కిలోమీటర్లకు పైగా క్యూలైన్ కనిపించింది. శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపించింది. అయితే గతంలోలా గంటల తరబడి వేచి ఉన్నా టోకెన్లు లేక ఇబ్బంది పడి వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా ఈ సారి నాలుగు రోజులలో ఎప్పుడైనా స్వామివారిని దర్సించుకునేందుకు టోకెన్లు ఇవ్వడంతో భక్తులు టోకెన్లతోనే తిరిగి వెళ్ళారు.
 
టోకెన్లు పొందిన స్థానికులు అయితే సరిపెట్టుకున్నారు గానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చేసేదిలేక కొంతమంది భక్తులు మాత్రం వెనుతిరిగి వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments