మాస్కులు కట్టుకుని దర్శన టిక్కెట్ల కోసం శ్రీవారి భక్తులు, ఎంత పెద్ద క్యూలైనో గోవిందా

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (18:25 IST)
ఎప్పుడు తిరుమల శ్రీవారి దర్సనం కోసం టోకెన్లను మంజూరు చేసినా భక్తులు మాత్రం వెనక్కి తగ్గరు. ఆ స్వామివారిని దర్సించుకోవడానికి భక్తులు ఎంతసేపయినా వేచి ఉంటారు. టోకెన్లను పొందుతారు. సరిగ్గా వారంరోజుల క్రితం నుంచి టోకెన్ల ప్రక్రియను టిటిడి నిలిపివేసింది.
 
ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి టోకెన్లను ఈ నెల 30వ తేదీ వరకు అందిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో టోకెన్లను పొందేందుకు భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. అర్థరాత్రి నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుపతిలో టోకెన్లను కేటాయించే మూడు ప్రాంతాల్లోను భక్తుల రద్దీ అదే స్థాయిలో కనిపించింది.
 
ముఖ్యంగా అలిపిరికి దగ్గరలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు బారులు తీరారు. రెండు కిలోమీటర్లకు పైగా క్యూలైన్ కనిపించింది. శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపించింది. అయితే గతంలోలా గంటల తరబడి వేచి ఉన్నా టోకెన్లు లేక ఇబ్బంది పడి వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా ఈ సారి నాలుగు రోజులలో ఎప్పుడైనా స్వామివారిని దర్సించుకునేందుకు టోకెన్లు ఇవ్వడంతో భక్తులు టోకెన్లతోనే తిరిగి వెళ్ళారు.
 
టోకెన్లు పొందిన స్థానికులు అయితే సరిపెట్టుకున్నారు గానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చేసేదిలేక కొంతమంది భక్తులు మాత్రం వెనుతిరిగి వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments