Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త కారుకు పూజ చేసిన పూజారీ... బ్రేక్‌కు బదులు దాన్ని తొక్కాడు.. అంతే..

Webdunia
ఆదివారం, 26 మే 2019 (10:53 IST)
ఓ పూజారీ తెలిసో తెలియకో చేసిన పనికి పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. కొత్త కారుకు పూజ చేసిన తర్వాత ఆయన బ్రేక్‌ను కాలితో తొక్కాల్సిందిపోయి.. యాక్సిలేటర్‌పై కాలు తొక్కాడు. అంతే.. ఒక్కసారిగా ఆ కారు భక్తులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా శ్రీశైలం సాక్షి గణపతి ఆలయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీశైలం పట్టణానికి చెందిన సిద్ధూ అనే పూజారి ఓ కొత్తకారును కొనుగోలు చేశాడు. దానికి స్థానికంగా ఉండే శ్రీశైలం సాక్షిగణపతి ఆలయం వద్ద పూజలు నిర్వహించేందుకు కారును తీసుకొచ్చాడు. ఈ కారుకు పూజలు ఆయనే స్వయంగా నిర్వహించాడు. 
 
ఆ తర్వాత అనంతరం కారును వెనక్కి తీసే క్రమంలో బ్రేకుకు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో కారు ఆలయంలోని భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను సంగారెడ్డి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments