కొత్త కారుకు పూజ చేసిన పూజారీ... బ్రేక్‌కు బదులు దాన్ని తొక్కాడు.. అంతే..

Webdunia
ఆదివారం, 26 మే 2019 (10:53 IST)
ఓ పూజారీ తెలిసో తెలియకో చేసిన పనికి పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. కొత్త కారుకు పూజ చేసిన తర్వాత ఆయన బ్రేక్‌ను కాలితో తొక్కాల్సిందిపోయి.. యాక్సిలేటర్‌పై కాలు తొక్కాడు. అంతే.. ఒక్కసారిగా ఆ కారు భక్తులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా శ్రీశైలం సాక్షి గణపతి ఆలయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీశైలం పట్టణానికి చెందిన సిద్ధూ అనే పూజారి ఓ కొత్తకారును కొనుగోలు చేశాడు. దానికి స్థానికంగా ఉండే శ్రీశైలం సాక్షిగణపతి ఆలయం వద్ద పూజలు నిర్వహించేందుకు కారును తీసుకొచ్చాడు. ఈ కారుకు పూజలు ఆయనే స్వయంగా నిర్వహించాడు. 
 
ఆ తర్వాత అనంతరం కారును వెనక్కి తీసే క్రమంలో బ్రేకుకు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో కారు ఆలయంలోని భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను సంగారెడ్డి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments