Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శనం, ఇలా ఆన్లైన్లో రిలీజ్, అలా భక్తులు బుక్

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (22:52 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్సనానికి ఆన్లైన్ టిక్కెట్లను ఎప్పుడూ ఆన్లైన్లో ఉంచినా భక్తులు పెద్దఎత్తున బుక్ చేసేసుకుంటున్నారు. ఆ స్వామివారిని దర్సించుకోవడానికి భక్తులు మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల తరువాత ఆలయం తెరుచుకోవడం దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఈ నెల 10వ తేదీ నుంచి అందించడం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఆన్లైన్‌లోను, ఆఫ్‌లోను కౌంటర్ల ద్వారా టోకెన్లను అందిస్తున్నారు.
 
కరోనాను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్యను విడతలవారీగా పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆన్‌లైన్లో జూలై నెలకు సంబంధించిన టోకెన్లను విడుదల చేశారు. ప్రతిరోజు భక్తులు 9 వేల టోకెన్ల వరకు ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు.
 
ఇక కౌంటర్ల ద్వారా అయితే 30వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. అయితే ఆన్‌లైన్లో ఇప్పటికే సగానికి పైగా టిక్కెట్లను భక్తులు బుక్ చేసేసుకున్నారట. కేవలం 300 రూపాయల శీఘ్ర దర్సనం మాత్రమే ఉన్న నేపథ్యంలో భక్తులు టోకెన్లను వెంటవెంటనే బుక్ చేసేసుకుంటున్నారని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
 
గతంలో సేవా టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేసే వెంట వెంటనే బుక్ చేసుకునేవారని, ఇప్పుడైతే 300 రూపాయల టోకెన్లనే భక్తులు ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం టిటిడి అధికారుల నుంచి వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments