Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేకు భక్తుడు రూ. 300 కోట్ల భారీ విరాళం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (16:17 IST)
ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి పేదల దగ్గర్నుంచి ధనికుల వరకూ కానుకల రూపంలో తమ మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత శ్రీనివాసుడుని దర్శించుకుంటున్న భక్తులు కానుకలను సమర్పించుకుంటున్నారు.
 
తాజాగా ఓ భక్తుడు తితిదేకి రూ. 300 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. తితిదే పరిధిలో నిర్మించ తలపెట్టిన ఆసుపత్రి నిర్మాణానికి అయ్యే రూ. 300 కోట్ల మొత్తం ఖర్చును తనే భరిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
 
ఇకపోతే ఇటీవలే ఓ తమిళ భక్తుడు ఒకడు కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామికి కోట్లాది రూపాయల విలువే చేసే శంఖుచక్రాలను కానుకగా సమర్పించారు. ఈ శంఖు, చక్రం విలువ రెండు కోట్ల రూపాయలు. వీటిని తమిళనాడుకు చెందిన భక్తుడు సమర్పించారు.
 
ఆ భక్తుడి పేరు తంగదొరు. తేనె జిల్లాకు చెందిన తంగదొరై పరమ స్వామి భక్తుడు. మూడున్నర కిలోల బంగారంతో శ్రీవారికి శంఖు, చక్రాలు చేయించారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు చెప్పారు. వీటిని బుధవారం ఉదయం టీటీడీ అదనపు ఈవోకు అందజేశారు. కాగా, తంగదొరై గతంలోనూ శ్రీవారికి బంగారు, వజ్రాభరణాలను విరాళంగా ఇచ్చారు. అందులో బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments