Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేకు భక్తుడు రూ. 300 కోట్ల భారీ విరాళం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (16:17 IST)
ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి పేదల దగ్గర్నుంచి ధనికుల వరకూ కానుకల రూపంలో తమ మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత శ్రీనివాసుడుని దర్శించుకుంటున్న భక్తులు కానుకలను సమర్పించుకుంటున్నారు.
 
తాజాగా ఓ భక్తుడు తితిదేకి రూ. 300 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. తితిదే పరిధిలో నిర్మించ తలపెట్టిన ఆసుపత్రి నిర్మాణానికి అయ్యే రూ. 300 కోట్ల మొత్తం ఖర్చును తనే భరిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
 
ఇకపోతే ఇటీవలే ఓ తమిళ భక్తుడు ఒకడు కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామికి కోట్లాది రూపాయల విలువే చేసే శంఖుచక్రాలను కానుకగా సమర్పించారు. ఈ శంఖు, చక్రం విలువ రెండు కోట్ల రూపాయలు. వీటిని తమిళనాడుకు చెందిన భక్తుడు సమర్పించారు.
 
ఆ భక్తుడి పేరు తంగదొరు. తేనె జిల్లాకు చెందిన తంగదొరై పరమ స్వామి భక్తుడు. మూడున్నర కిలోల బంగారంతో శ్రీవారికి శంఖు, చక్రాలు చేయించారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు చెప్పారు. వీటిని బుధవారం ఉదయం టీటీడీ అదనపు ఈవోకు అందజేశారు. కాగా, తంగదొరై గతంలోనూ శ్రీవారికి బంగారు, వజ్రాభరణాలను విరాళంగా ఇచ్చారు. అందులో బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments