Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస కార్మికుల జీవనం దుర్భరం.. బావిలో ఏడుగురి మృతదేహాలు

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (12:12 IST)
కరోనా కారణంగా వలస కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. వలసకు వెళ్లి లాక్ డౌన్ కారణంగా స్వస్థలాలకు చేరుకున్న కూలీల పరిస్థితి దారుణంగా వుంది. తాజాగా బావిలో వలస కూలీల మృతదేహాలు లభ్యం కావడం వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. పొట్ట చేతపట్టుకుని వచ్చిన వారంతా చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
గురువారం నాలుగు మృతదేహాలు లభ్యం కాగా.. తాజాగా మరో మూడు లభించాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. కుటుంబం మొత్తం ఒకేసారి ఇలా బావిలో శవాల్లా కనిపించడం వెనక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారంతా ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
బిహార్‌కు చెందిన మక్సూద్‌ (50) కుటుంబం 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చింది. అక్కడా ఇక్కడా పని చేసుకుంటూ కొన్ని రోజుల క్రితం గీసుకొండలోని గోనే సంచులు తయారు చేసే పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరంతా పరిశ్రమలోనే ఓ గదిలో నివాసం ఉంటున్నారు.

తాజాగా మన్సూద్ అతని భార్య నిషా, ఇద్దరు కొడుకులు, కూతురు, మనవడు బావిలో శవాలై కనిపించారు. వీరంతా మసూద్‌, నిషా, బుషారాకతూన్‌, బేబీ, షకీల్‌, షాబాజ్‌ అలం, సోహైల్ అలంగా గుర్తించారు. పోస్టు మార్టం రిపోర్ట్ రావాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments