Webdunia - Bharat's app for daily news and videos

Install App

449 మంది విద్యార్థుల త్రాగునీటి సమస్య తీర్చిన డిప్యూటీ సీఎం పవన్

ఐవీఆర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (22:36 IST)
గత నాలుగేళ్లుగా రక్షిత త్రాగునీటి సదుపాయం లేక అవస్థలు పడుతున్న 449 మంది విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కల్పించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల తాగునీటి సమస్యను తెలుసుకుని, సమీపంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద మంచినీరు వస్తున్న విషయం గుర్తించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో సంబంధిత అధికారులు రైస్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించారు.
 
4 లక్షల CSR ( Corporate Social Responsibility) నిధులతో RO ప్లాంట్‌కు రైస్ మిల్ నుండి మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం కోసం డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేయడం ద్వారా, విద్యార్థులకు స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. పాఠశాలలో మంచినీటి కుళాయిల నుంచి మంచినీటిని తమ బాటిళ్లలో నింపుకుంటూ విద్యార్థులు ఎంతో సంతోషపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments