Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై - పుదుచ్చేరిల మధ్య తీరందాటిన వాయుగుండం

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (08:37 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం వేకువజామున 3 నుంచి 4 గంటల మధ్యలో చెన్నై - పుదుచ్చేరి ప్రాంతాల మధ్య తీరందాటిందని భారత వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. 
 
అయితే, దీని ప్రభావం కారణంగా ఉత్తర తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొంది. 
 
మరోవైపు, చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే వున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కళ్యాణి జలాశయానికి వరదనీరు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో జలాశంయ 3 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 
 
స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా అటుగా వెళ్లే వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ భారీ వర్షంతో తిరుపతి పట్టణం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునిపోయింది. తిరుమల ఘాట్ రోడ్లను మూసివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments