Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగీ పంజా.. జూలై 16వరకు 286 కొత్త కేసులు

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (13:34 IST)
రాష్ట్ర రాజధానిపై డెంగీ పంజా విసిరింది. హైదరాబాద్‌లో మూడు వారాలుగా భారీగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. జూలై 23 నుంచి ఈ నెల 16 వరకు 286 కొత్త కేసులు వచ్చాయి. అంటే రోజూ సగటున 12 వర కు కేసులు నమోదవుతున్నాయి. 
 
ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 16 సాయంత్రం వరకు కొత్తగా 1206 డెంగీ కేసులు నమోదయ్యాయి. వాటిలో హైదరాబాద్‌లో 447, రంగారెడ్డిలో 115, ఖమ్మంలో 122 డెంగీ పాజిటివ్‌లు వచ్చాయి. 
 
అంటే 60 కేసులు ఈ మూడు జిల్లాల్లోనే నమోదయ్యాయి. ఈ ఏడాది జూలై 23 నాటికి రాష్ట్రంలో 405 డెంగీ, 409 మలేరియా కేసులున్నాయి. కేవలం 24 రోజుల్లోనే కొత్తగా 801 డెంగీ, 100 మలేరియా కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో 12 జిల్లాల్లను డెంగీ, 11 జిల్లాలను మలేరియా హైరిస్కు జిల్లాలుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
 
నాలుగు జిల్లాల్లో మాత్రం రెండింటి తీవ్రత ఉన్నట్లు గుర్తించింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ కేసులు పెరుగుతున్నాయి. నగరాలు, మునిసిపాలిటీలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లో సీజనల్‌ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వాటి విజృంభణ మొదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్

తనకు సలార్ అంటే ఆయనే అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments