Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో స్కూల్స్ - కాలేజీలకు సెలవులు ప్రకటించిన మంత్రి సబితా

Advertiesment
New Academic Year 2021-22
, శనివారం, 4 సెప్టెంబరు 2021 (16:37 IST)
తెలంగాణా రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలకు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి సెలవులు ప్రకటించారు. 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఈ సెలవులు వెల్లడించారు. 
 
మొత్తం 213 పని దినాలతో కొత్త విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపారు. ఇందులో 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. 
 
అదేసమయంలో అక్టోబరు 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. మిషనరీ స్కూల్స్‌లు డిసెంబరు 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులను వెల్లడించారు. 
 
ఇకపోతే సంక్రాంతి సెలవులుగా జనవరి 11 నుంచి 16 వరకు, వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 12వ వరకు ఉంటాయని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రి టాయిలెట్‌లో నెలలు నిండని పిండాన్ని ప్రసవించిన రేప్ బాధితరాలు!!