Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టుబడుతున్న మన తెలుగోళ్లు... ఎవరీ రామ్మోహన్ రావు? 200 కేజీల బంగారం నిజమేనా?

అదేమి విచిత్రమో గానీ ఈమధ్య దక్షిణాదిలో వరసబెట్టి ఆదాయపన్ను శాఖకు పట్టుబడుతున్నవారు తెలుగువాళ్లు కావడం కాకతాళీయమో లేక గ్రహచారమో తెలియడంలేదు. నోట్ల రద్దు తర్వాత ఆదాయపు పన్ను శాఖ దృష్టిలోకి మన తెలుగువాళ్లు పడుతున్నారు... దొరికిపోతున్నారు. తాజాగా తమిళనాడ

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (21:12 IST)
అదేమి విచిత్రమో గానీ ఈమధ్య దక్షిణాదిలో వరసబెట్టి ఆదాయపన్ను శాఖకు పట్టుబడుతున్నవారు తెలుగువాళ్లు కావడం కాకతాళీయమో లేక గ్రహచారమో తెలియడంలేదు. నోట్ల రద్దు తర్వాత ఆదాయపు పన్ను శాఖ దృష్టిలోకి మన తెలుగువాళ్లు పడుతున్నారు... దొరికిపోతున్నారు. తాజాగా తమిళనాడు ప్రభుత్వంలో అత్యంత కీలక పదవిలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ రావు ఇళ్లపై ఐటీ దాడులు జరగడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
ఇకపోతే అసలీ రామ్మోహన్ రావు ఎవరు? అని ఒక్కసారి పరిశీలిస్తే... రామ్మోహన్ రావు పుట్టింది ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో. 1985 తమిళనాడు ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు. 1987లో అసిస్టెంట్ కలెక్టరుగా పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు గుజరాత్ రాష్ట్రంలో కూడా పనిచేశారు. ఇంకా ఆయన వివిధ విభాగాల్లో పనిచేశారు. 
 
వ్యవసాయం, హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ తదితర విభాగాల్లో పనిచేశారు. 2011లో ఆయనను ముఖ్యమంత్రి జయలలిత ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు. ఆ తర్వాత జూన్ నెలలో ఆశ్చర్యకరంగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు జయలలిత. రామ్మోహన్ రావుకు తమిళనాడు బడా వ్యాపారులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నట్లు చెపుతారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments