Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువు న‌ష్టం దావా.. విచార‌ణ‌ జూన్ 21కి వాయిదా

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (18:18 IST)
తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబర్‌ 1న ప్రచురించిన కథనంపై ఆ ప‌త్రిక‌పై టీటీడీ రూ.100 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. 
 
ఈ మేరకు తెలుగు దిన‌ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతిపై టీటీడీ పరువు నష్టం దావాపై  మంగ‌ళ‌వారం నాడు తిరుప‌తి నాలుగో అద‌న‌పు జ‌డ్జి కోర్టులో విచార‌ణ జ‌రిగింది. 
 
ఈ విచార‌ణ‌కు టీటీడీ త‌ర‌ఫున న్యాయ‌వాదిగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి హాజ‌ర‌య్యారు. ఇక ఆంధ్ర‌జ్యోతి త‌ర‌ఫు న్యాయ‌వాదిగా క్రాంతిచైత‌న్య హాజ‌ర‌య్యారు.
 
ఈ సంద‌ర్భంగా ఇరువురు న్యాయవాదుల మ‌ధ్య వాదోప‌వాదాలు హోరాహోరీగా సాగాయి. ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం నోటీసులు జారీ చేసుకున్నాయి. ఈ నోటీసుల‌పై కౌంట‌ర్లు దాఖ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. విచార‌ణ‌ను జూన్ 21కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments