Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరువు నష్టం దావా కంటే సారీ కోరవచ్చు కదా : సమంతకు కోర్టు సూచన

పరువు నష్టం దావా కంటే సారీ కోరవచ్చు కదా : సమంతకు కోర్టు సూచన
, శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:37 IST)
హీరో అక్కినేని నాగచైతన్య - హీరోయిన్ సమంతలు తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సమంత క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్‌కి, ఆమెకు మధ్య ఏదో ఉందంటూ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి.
 
ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించాయంటూ రెండు యూట్యూబ్ ఛానళ్లపై సమంత హైదరాబాదులోని కూకట్ పల్లి కోర్టులో పరువునష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా కోర్టు తన అభిప్రాయాలను వెల్లడించింది. 
 
సదరు యూట్యూబ్ ఛానళ్లపై పరువునష్టం దావా వేయడం కంటే... వాటి నుంచి క్షమాపణ కోరవచ్చు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. మరోవైపు శుక్రవారం ఈ కేసుపై తుదితీర్పు వెలువరించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెఫేలో పెళ్లి చూపులు : 'వరుడు కావలెను' ట్రైలర్ రిలీజ్