Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా దూసుకొస్తున్న వాయుగుండం.. గంటకు 32 కిమీ వేగంతో ప్రయాణం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:37 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీవనం శరవేగంగా దూసుకొస్తుంది. ఇది గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని, ఇది శనివారం ఉదయానికి తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
వచ్చే 24 గంటల్లో అది జవాద్ తుఫానుగా మారే ప్రమాదం ఉందని తెలిపింది. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర - ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం ఉదయం 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
మరోవైపు తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు విశాఖ మున్సిపల్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. పోలీస్, రెవెన్సూ, ఇరిగేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసి వారంతా కలిసి పని చేసేలా ఒక యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments