Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలపడిన వాయుగుండం - ఆంధ్రాను తాకనున్న యాంపిన్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచివుంది. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం మరితంగా బలపడింది. ఇది శుక్రవారం వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుండగా, దీనికి వాతావరణ శాఖ 'యాంపిన్' అని పేరు పెట్టారు. 
 
శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయానికి ఇది తుఫానుగా రూపాంతరం చెందనుంది. ఆపై తొలుత వాయవ్య దిశలో, ఆపై ఉత్తర ఈశాన్య దిశలో పయనించి పెను తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 
 
కాగా, ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, దీనికి యాంపిన్‌తోడు కానుందని 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. 
 
17వ తేదీన తీరం వెంబడి 80 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, 18న గాలుల తీవ్రత అధికమవుతుందని హెచ్చరించారు. ఇంకోవైపు శుక్రవారం రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
 
కాగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా, మామిడి, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ అకాల వర్షం నుంచి తేరుకోకముందే ఇపుడు తుఫాను    

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments