ప్రస్తుత ఇసుక విధానం ఏమీ బాగోలేదు: కూటమి ప్రభుత్వానికి జ్యోతుల నెహ్రూ షాక్

ఐవీఆర్
శుక్రవారం, 15 నవంబరు 2024 (16:44 IST)
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం ఎంతమాత్రం బాగోలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఆయన మాటలతో అధికార పక్షంలో విపక్షం స్వరం ఏంటయా అంటూ అందరూ తలలు పట్టుకున్నారు. ఐనప్పటికీ జ్యోతుల నెహ్రూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటి ఇసుక విధానం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదిగా వుందని అన్నారు.
 
గత ప్రభుత్వం మాదిరిగా ఎవరికి అవసరమో వారికి మాత్రమే ఇసుక చేరేట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు ఇసుక వ్యవహారం అంతా అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయిందనీ, ఫలితంగా ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని అన్నారు. ఇంకా మట్టి గురించి కూడా ఆయన మాట్లాడబోతుండగా... డిప్యూటీ స్పీకర్ రాజు... జ్యోతుల నెహ్రూను కూర్చోవాలంటూ సూచన చేసారు.
 
దాంతో నెహ్రూ మాట్లాడుతూ.. ఈ సభలో నేనే సీనియర్ ఎమ్మెల్యేను. నాకే మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా.. ప్రతిపక్ష సభ్యులను చూసినట్లు నన్ను చూస్తే ఎలా... అని ప్రశ్నించారు. నన్ను మాట్లాడవద్దని చెప్పడం కంటే సభకు రావద్దంటే రానంటూ వ్యాఖ్యానించారు. దీనితో ఇపుడిదే చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments