Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రస్తుత ఇసుక విధానం ఏమీ బాగోలేదు: కూటమి ప్రభుత్వానికి జ్యోతుల నెహ్రూ షాక్

ఐవీఆర్
శుక్రవారం, 15 నవంబరు 2024 (16:44 IST)
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం ఎంతమాత్రం బాగోలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఆయన మాటలతో అధికార పక్షంలో విపక్షం స్వరం ఏంటయా అంటూ అందరూ తలలు పట్టుకున్నారు. ఐనప్పటికీ జ్యోతుల నెహ్రూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటి ఇసుక విధానం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదిగా వుందని అన్నారు.
 
గత ప్రభుత్వం మాదిరిగా ఎవరికి అవసరమో వారికి మాత్రమే ఇసుక చేరేట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు ఇసుక వ్యవహారం అంతా అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయిందనీ, ఫలితంగా ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని అన్నారు. ఇంకా మట్టి గురించి కూడా ఆయన మాట్లాడబోతుండగా... డిప్యూటీ స్పీకర్ రాజు... జ్యోతుల నెహ్రూను కూర్చోవాలంటూ సూచన చేసారు.
 
దాంతో నెహ్రూ మాట్లాడుతూ.. ఈ సభలో నేనే సీనియర్ ఎమ్మెల్యేను. నాకే మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా.. ప్రతిపక్ష సభ్యులను చూసినట్లు నన్ను చూస్తే ఎలా... అని ప్రశ్నించారు. నన్ను మాట్లాడవద్దని చెప్పడం కంటే సభకు రావద్దంటే రానంటూ వ్యాఖ్యానించారు. దీనితో ఇపుడిదే చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments