Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కర్ఫ్యూ సడలింపులు... ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం...

Webdunia
సోమవారం, 5 జులై 2021 (14:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోవున్న కర్ఫ్యూ సడలింపుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అయితే, ఉభయగోదావరి జిల్లాల్లో సాయంత్రం 6 గంటలకే దుకాణాలను మూసివేస్తామన్నారు. పాజిటీవీటీ రేటు 5 లోపు వచ్చేంత వరకూ ఆంక్షల కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉండనున్నాయి.
 
అయితే, ఈ జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాలను మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు. సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా సినిమా థియేటర్లకు అనుమతి లభించనుంది. రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండపాలకు కొవిడ్‌ నిబంధనలతో అనుమతి లభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి చేశారు.
 
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి నానితో పాటు... ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments