Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లాలో బర్డ్ ‌ఫ్లూ... భారీగా కోళ్లు మృతి.. కోడిమాంసం తినొద్దంటున్న అధికారులు..

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (09:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తుంది. దీంతో వందలాది కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. పలు కోళ్ళఫారంల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ జిల్లాలో బర్డ్ ఫ్లూ అధికంగా ఉన్నట్టు అధికారులు నిర్దారించారు. దీంతో కోడిమాంసం ఆరగించవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందని, అందువల్లే కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగా కొన్ని రోజుల పాటు ప్రజలు చికెన్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చికెన్ వినియోగం తగ్గించాలని కోరారు. 
 
తూర్పు గోదావరి జిల్లాలో కోళ్లు చనిపోతుండటంతో అధికారులు పలు గ్రామాల్లో కోళ్లఫారంల నుంచి శాంపిల్స్ సేకరించారు. కానూరు గ్రామంలోని కోళ్లఫారం నుంచి సేకరించిన శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు వీలుగా 954209 08025 అనే ఫోన్ నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments