Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ మంజూరుతో ప‌దివేల కోట్ల పెట్టుబ‌డుల రాక‌

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (18:07 IST)
ఆంధ్రప్రదేశ్‌లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని, ఇది హర్షణీయమని ప్రముఖ శాస్త్రవేత్త, ఎస్సార్సీ ల్యాబోరేటరీ అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. దీనివ‌ల్ల ఏపీకి 10 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డులు రానున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.


బ‌ల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, అలాగే సాధించేందుకు కృషి చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ‌లో డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, బల్క్ డ్రగ్ పార్క్ స్థాపన ద్వారా ఏపీకి రూ 10 వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని, రానున్న ఎనిమిదేళ్లలో ఈ పార్కు  ద్వారా రూ 50 వేల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందన్నారు. 

 
బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది యువతీయువకులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. బల్క్‌ డ్రగ్‌ ఉత్పత్తిలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చైనా ప్రధమ స్థానంలో ఉందని, ఈ నూతన పార్కు రావడం ద్వారా మన దేశం ప్రధమ స్థానంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని డాక్టర్ ఏలూరి అన్నారు. ఫార్మ రంగానికి పన్ను ప్రోత్సాహకాలు, రాయితీల ఇచ్చి మరింత ప్రోత్సాహించాలని ఆయా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యల ద్వారా కరోనా లాంటి మహమ్మారులు ఎన్ని వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని డాక్టర్ ఏలూరి  రామచంద్రారెడ్డి భరోసా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments