Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడి యువకుడు బలి, ఎక్కడ?

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (18:38 IST)
నేటితరం యువత జూదాలకు, బెట్టింగ్‌లకు పాల్పడి తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. క్రికెట్ ఎంతో ప్రామాణికతో కూడున్నది. అటువంటి క్రీడల్లో సాధించాల్సిన యువత వాటిని జూదాలుగా మార్చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడు ప్రాణాలు బలితీసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో దిగి లక్షల్లో కోల్పోయిన ఇద్దరు యువకులు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు.
 
వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. గుంటూరు జిల్లా పెదకూరు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన సురేశ్, బెల్లంకొండకు చెందిన కొమరయ్య ఇద్దరూ బెల్లంకొండలోని రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లారు. అప్పటికే దారిలో వారు పురుగుల మందు తాగారు. వీరిని కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందగా శంకర్ పరిస్థితి విషమంగా ఉంది.
 
క్రికెట్ బెట్టింగ్‌లో తాము లక్షల్లో నష్టపోయామని ఆ బాకీలను తీర్చాలని నిర్వాహకుడు ఒత్తిడి చేయడంతో తాము చనిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. దీంతో పురుగుల మందు తాగుతున్నామంటూ సెల్ఫీ తీసి వాటిని తమ బంధువులకు పంపించారు. కేవలం క్రికెట్ బెట్టింగ్ వల్లే సురేశ్ చనిపోయాడని దీనికి సంబంధించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మృతుడు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్‌కు మరొకరు బలి కాకూడదని వేడుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments