Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఇచ్చిన పాచిపోయిన లడ్డూల టేస్ట్ మారిందా పవనూ? సీపీఐ రామకృష్ణ

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (16:30 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందని గతంలో చెప్పిన పవన్‌కు ఇపుడు లడ్డూల టేస్ట్ మారిందా? అని ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్రంలో చేవ చచ్చిన నాయకులు ముందుకు వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు అన్ని పార్టీలు మందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అప్రజాస్వామిక పోకడలపై తాము అలుపెరగని పోరు సాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. 
 
అంతేకాకుండా, ఒకవైపు, సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా దిశానిర్ధేశంలో పని చేస్తున్నారని ఆరోపించారు. ఇపుడు పవన్ కళ్యాణ్ కూడా రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీ నేతలను కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీజేపీ నేతల డైరెక్షన్‌లో పని చేస్తున్న సీఎం జగన్‌ను దించి తనకు రోడ్ మ్యాచ్ ఇవ్వమని పవన్ అడగడంపై రామకృష్ణ విస్మయం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments